Halloween Costume ideas 2015
Latest Post

11:57:00 AM

ఉత్తమ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీని ప్రకటించిన యూనెస్కో


 దేశంలో హల్ చల్ చేసిన చాలా బూటకపు కథనాలకు మూలంగా నిలిచింది ఐక్యరాజ్యసమితికి చెందిన సాంస్కృతిక సంస్థ యూనెస్కో. గత జూన్ లో ఈ బూటకపు కథనం వెలుగుచూసింది. సోషల్ మీడియాలో, వాట్సాప్ లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఇప్పటికే మోదీకి బెస్ట్ పీఎంగా యూనెస్కో పురస్కారం అందిందన్న బూటకపు వార్త వాట్సాప్ లో చక్కర్లు కొడుతూనే ఉంది.




ఉత్తమ జాతీయగీతంగా 'జనగణమన'ను ఎంపిక చేసిన యూనెస్కో


 ఈ ఫేక్ కథనం కూడా వాట్సాప్ యూజర్లు ప్రతి ఒక్కరికీ చేరి ఉంటుంది. ప్రపంచంలోనే ఉత్తమ జాతీయగీతంగా 'జనగణమన'ను యూనెస్కో ప్రకటించిందంటూ ఈ కథనం 2008 నుంచి ఈమెయిళ్లలో చక్కర్లు కొడుతోంది. అప్పట్లోనే యూనెస్కో స్పందించింది. దేశంలోని పలు బ్లాగుల్లో ప్రచురించినట్టు భారత జాతీయగీతం గురించిగానీ, ఇతర దేశం గురించిగానీ తాము ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టత ఇచ్చింది. అయినా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ న్యూస్ విపరీతంగా చక్కర్లు కొట్టింది.  

ప్రపంచంలోనే ఉత్తమ కరెన్సీగా రూ. 2000 నోటును ప్రకటించిన యూనెస్కో


 నోట్ల రద్దు సంక్షోభంతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో చక్కర్లు కొట్టిన మరో ఫేక్ న్యూస్ ఇది. రూ. 2000 నోటును యూనెస్కో ఉత్తమ కరెన్సీగా ప్రకటించిందంటూ వాట్సాప్ లో విపరీతంగా వ్యాప్తి చెందింది ఈ కథనం. విశేషమేమిటంటే ఏకంగా బీబీసీ కూడా ఈ వదంతి గురించి స్పందించి ఓ కథనాన్ని ఇచ్చింది. భారతీయులు మరీ మురిసిపోతూ ఈ ఫేక్ కథనాన్ని షేర్ చేసుకుంటున్నారని పేర్కొంది.

కొత్త నోట్లలో జీపీఎస్ చిప్.. నల్లధనానికి చెక్!




 నవంబర్ 8న పెద్దనోట్లను ప్రధాని మోదీ రద్దు చేసిన తర్వాత ఈ విషయంలో ఎన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. కొత్త రెండువేల నోటులో నానో జీపీఎస్ చిప్ ఉందని, ఎవరైనా పెద్దమొత్తంలో ఈ నోట్లను దాచిపెడితే.. సులువుగా దొరికిపోతారని, భూమిలో 120 మీటర్ల లోతులో నోట్లు దాచిపెట్టినా.. రాడర్ నిఘా నుంచి తప్పించుకోలేరంటూ ఈ వదంతి బాగా హల్ చల్ చేసింది. నోట్లరద్దుపై ప్రధాని మోదీ ప్రకటన చేసిన గంటలోపే తెరపైకి వచ్చిన ఈ రూమర్ ఎంత వేగంగా పాకిపోయిందంటే.. ఏకంగా దీనిపై ఆర్బీఐ సైతం వివరణ ఇచ్చింది. నోటులో అనేక భద్రతాపరమైన ఫీచర్లు ఉన్నాయి కానీ, ఎలాంటి చిప్ లేదని తేల్చేసింది.

కొత్త నోట్లలో రేడియోయాక్టివ్ ఇంక్
దేశంలో భారీగా కొత్త నోట్లు అక్రమార్కుల వద్ద దొరికిపోతుండటంతో తెరపైకి వచ్చిందీ ఈ వదంతి. ఆర్బీఐ రేడియోయాక్టివ్ ఇంక్ తో కొత్త రూ. 500, రెండువేల నోట్లను ముద్రించిందని, దీనితో ప్రజలకు ఎలాంటి హాని ఉండదని, కానీ ఎవరైనా వీటిని పెద్దమొత్తంలో దాచుకుంటే ఐటీ అధికారులు ఇట్టే పట్టేయగలరంటూ ఈ ఫేక్ న్యూస్ హల్ చల్ చేసింది. ఈ ఇంక్ వల్లే పెద్ద ఎత్తున అక్రమార్కులు దొరికిపోతున్నారంటూ ఊహాగానాలు జోడించింది.

వాట్సాప్ ప్రొఫెల్ పిక్చర్లతో..
మహిళలు తమ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లు తొలగించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ సూచించినట్టు వచ్చిన ఒక రూమర్ హల్ చల్ చేసింది. ఈ ప్రొఫైల్ చిత్రాలను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దుర్వినియోగం చేయవచ్చునని, ఈ చిత్రాల ద్వారా  ఇస్లామిక్ స్టేట్ హ్యాకర్లు వ్యక్తిగత సమాచారం దొంగలించి.. దానిని ఉగ్రవాద కార్యక్రమాల్లో దుర్వినియోగం చేయవచ్చునంటూ, మహిళల అప్రమత్తంగా ఉండాలంటూ ఈ వదంతి చక్కర్లు కొట్టింది. అయితే, ఢిల్లీ పోలీసు కమిషనర్ ఏకే మిట్టల్ ఈ ప్రకటన చేశారని ఈ వదంతి పేర్కొనగా.. అసలు ఢిల్లీ సీపీ ఏకే వర్మ కావడంతో ఇది ఫేక్ అని తేలిపోయింది.

పది రూపాయల నాణెలు రద్దుచేసిన ఆర్బీఐ
నోట్ల రద్దుకు ముందు ఆగ్రా, ఢిల్లీ, మీరట్ ప్రాంతాల్లో ఈ ఫేక్ వార్త బాగా హల్ చల్ చేసింది. పదిరూపాయల నాణెలను ఆర్బీఐ రద్దు చేసిందంటూ కథనాలు రావడంతో స్థానిక వ్యాపారులు, రిక్షా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగి ఇది ఈ వార్త వట్టి బూటకమని తేల్చింది.

జయలలిత రహస్య కూతురు!

 తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి తర్వాత ఆమెకు రహస్యంగా కూతురు ఉన్నారని, ఆమె అమెరికాలో నివసిస్తున్నారని ఓ మహిళ ఫొటోతో బూటకపు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలు ఖండిస్తూ ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద వివరణ ఇచ్చింది. సదరు ఫొటోలో ఉన్న మహిళతో జయలలితకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఆస్ట్రేలియాలో నివసిస్తున్నదని చిన్మయి తెలిపింది.

ఉప్పు కొరత!
నోట్ల రద్దు తర్వాత ఉప్పు కొరత వదంతి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద దుమారమే రేపింది. దేశానికి 7,517 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నా ఉప్పు కొరత వస్తుందంటూ వార్తలు రాగా.. సామాన్యులు అది నమ్మి అర్ధరాత్రి దుకాణాలకు పోటెత్తారు. ఉప్పు ధర నాలుగు రెట్లు పెరిగిపోయింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పశ్చిమ యూపీ, ఢిల్లీ, మహారాష్ట్ర, హైదరాబాద్ లో ఈ రూమర్ల ప్రభావం పడింది. ఉప్పు కోసం జనాలు పోటెత్తడంతో కాన్పూర్ లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

నెహ్రూ ప్రభుత్వం మర్రిచెట్టులా నిలిచింది
దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్  నెహ్రూ ప్రభుత్వం మరిచెట్టులా నీడ పరిచిందని, ఆయన కుటుంబం వల్ల ఇతరులు ఎదిగే అవకాశమే లేకుండా పోయిందని విమర్శిస్తూ బీబీసీ ఇండియా మాజీ బ్యూరో చీఫ్ మార్క్ టుల్లీ అన్నట్టు వదంతులు వచ్చాయి. ప్రధాని మోదీని పొగుడుతూ.. ఆయన వ్యాఖ్యలు చేశారని ఈ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ తాను అలా అనలేదని మార్క్ టుల్లీ స్వయంగా వివరణ ఇచ్చారు.
 
                                                                                                                               సోర్స్ : సాక్షి దినపత్రిక






టైటిల్ : వంగవీటి
జానర్ : క్రైం థ్రిల్లర్
తారాగణం : సందీప్ కుమార్, వంశీ నక్కంటి, వంశీ చాగంటి, నైనా గంగూలి, కౌటిల్యా, శ్రీతేజ్
సంగీతం : రవి శంకర్
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత : దాసరి కిరణ్ కుమార్

చాలా కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు తీయడంలో ఫెయిల్ అవుతున్న రామ్ గోపాల్ వర్మ.., ఇదే తెలుగులో నా ఆఖరి సినిమా.. ఈ సారి తప్పకుండా మెప్పిస్తానని చెప్పి మరీ తీసిన సినిమా వంగవీటి. గతంలో అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో రక్తచరిత్ర తీసిన వర్మ, పాత్రలను నిజజీవిత పేర్లతో కాకుండా ఆ భావం వచ్చేలా చూపించాడు. కానీ వంగవీటి విషయంలో మాత్రం మరో అడుగు ముందుకు వేసి.. నిజజీవితంలోని పేర్లతో యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన వంగవీటి వర్మ స్థాయిని ప్రూవ్ చేసిందా..?

కథ :
విజయవాడ రౌడీయిజం.. అందరికీ తెలిసిందే అయినా వర్మ తన మార్క్ సినిమాటిక్ టచ్ తో ఆ కథను మరింత ఎఫెక్టివ్ గా చూపించే ప్రయత్నం చేశాడు. ఎర్రపార్టీ నాయకుడు చలసాని వెంకటరత్నం విజయవాడ సిటీలో పేదలకు అండగా ఉంటూ లీడర్ గా ఎదుగుతాడు. అదే సమయంలో బస్టాండ్ లో చిన్న రౌడీగా ఉన్న వంగవీటి రాధ. వెంకటరత్నం దగ్గర పనిలో చేరి అతన్ని మించిపోయే స్థాయిలో పేరు తెచ్చుకుంటాడు. రాధ ఎదుగుదలను తట్టుకోలేని వెంకటరత్నం ఇంటికి పిలిచి రాధను అవమానిస్తాడు. తనకు జరిగిన అవమాన్ని జీర్ణించుకోలేని రాధ వెంకటరత్నాన్ని పక్కా ప్లాన్ తో దారుణంగా నరికి నరికి చంపుతాడు.

అప్పటి వరకు ఓ లీడర్ వెనుక అనుచరిడిగా ఉన్న రాధ, వెంకటరత్నం మరణంతో విజయవాడను శాసించే నాయకుడిగా మారతాడు. తనకు ఎదురొచ్చిన వారందరిని అడ్డుతప్పించుకుంటూ ఎవరూ ఎదిరించలేని స్థాయికి చేరుకుంటాడు. ఆ సమయంలో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే దేవినేని గాంధీ, దేవినేని నెహ్రులు కాలేజీ గొడవలో పార్టీ ప్రమేయాన్ని ఆపాలంటూ రాధను కలుస్తారు. రాధ మంచితనం నచ్చి అతనితో కలిసి ఓ పార్టీని ఏర్పాటు చేసి విద్యార్థులతో కలిసి రాధకు అండగా నిలుస్తారు.

రాధ ఎదుగుదలతో విజయవాడ నగరంలో ఎర్ర పార్టీ ఆనవాళ్లు లేకుండా పోతాయన్న భయంతో ఆ పార్టీ పెద్దలు రాధ హత్యకు పథకం వేస్తారు. ఓ సెటిల్మెంట్ కోసం పిలిపించి ఒంటరిని చేసి చంపేస్తారు. అప్పటి వరకు రాజకీయం, రౌడీయిజం తెలియని రాధ తమ్ముడు రంగా., తప్పనిసరి పరిస్థితుల్లో అన్న బాటలోకి అడుగుపెడతాడు. అప్పటి వరకు అన్నకు అండగా ఉన్న దేవినేని సోదరులతో అభిప్రాయ భేదాలు రావటంతో వారు సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. దేవినేని సోదరుల నుంచి రంగా ప్రాణానికి ముప్పు ఉందని భావించి ఆయన అనుచరులు గాందీని చంపేస్తారు. అన్న మరణంతో దేవినేని మురళి రగలిపోతాడు. ఎలాగైన రంగా మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.

అప్పటి వరకు రౌడీగా ఉన్న రంగా ఓ జాతీయ పార్టీ నుంచి టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అదే సమయంలో ఆంధ్రరాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఓ ప్రాంతీయ పార్టీలో చేరిన నెహ్రు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. నెహ్రు ఎమ్మెల్యే కావటంతో అతని తమ్ముడు మురళీకి పగ తీర్చుకునేందుకు కావాల్సిన అన్ని వనరులు అందుతాయి. దీంతో గాంధీ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఒక్కొక్కరిని వెతికి వెతికి చంపుతాడు. అంతేకాదు ఏకంగా రంగా.. ఇంటికే ఫోన్ చేసి ఆయన భార్య రత్న కుమారికి వార్నింగ్ ఇస్తాడు.

మరోసారి మురళీ వల్ల రంగాకు ప్రమాదం ఉందని భావించి అతన్ని కూడా రంగా అనుచరులు చంపేస్తారు.
అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ విజయవాడలో పెరిగిపోతున్న రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించుకుంటుంది. ప్రజా సమస్యల కోసం తన ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తున్న రంగాను నల్ల బట్టల్లో వచ్చిన దుండగులు దీక్షా వేదిక మీద నరికి చంపేస్తారు. రంగ మరణంతో రగిలిపోయినా విజయవాడ కొద్ది రోజులకు సాధారణ స్థితికి చేరుకుంటుంది. అయితే రంగా మరణం వెనక ఉన్నది ఎవరు అన్నది మాత్రం వర్మ కూడా ప్రేక్షకులకు ప్రశ్నగానే వదిలేశాడు.

ప్లస్ పాయింట్స్ :
వర్మ మార్క్ టేకింగ్
సందీప్ ద్విపాత్రాభినయం
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
డైలాగ్స్
మితిమీరిన రక్తపాతం


- సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్ Source : Sakshi News 

6:23:00 PM




 
 
 
Published on Dec 17, 2016
Listen & Enjoy Shatamanam Bhavati Telugu Movie Full Songs Jukebox. Starring Sharwanand, Anupama Parameshwaran, Music composed by Mickey J Meyer, Directed by Vegesna Satish and Produced by Dil Raju under the banner of Sri Venkateswara Creations. ♫►Songs◄♫

Mellaga Tellarindoi
Shatamanam Bhavati
Naalo Nenu
Nilavade
Hailo Hailessare


Song: Mellaga Tellarindoi
Music: Mickey J Meyer
Singers: Anurag Kulkarni, Ramya Behara, Mohana Bhogaraju
Lyrics: Srimani

Song: Shatamanam Bhavati
Music: Mickey J Meyer
Singer: Chitra, Vijay Yesudas
Chorus: Sri Krishna, Deepu, Krishna Chaithanya, Aditya Iyengar, Rohit Paritala, Shravana Bhargavi, Anjana Sowmya, Ramya Behara, Sai Shivani, Mohana Bhogaraju
Lyrics: Ramajogaiah Sastry

Song: Naalo Nenu
Music: Mickey J Meyer
Singer: Sameera Bharadwaj
Lyrics: Ramajogaiah Sastry

Song: Nilavade
Music: Mickey J Meyer
Singer: S.P.Balasubramanyam
Lyrics: Ramajogaiah Sastry

Song: Hailo Hailessare
Music: Mickey J Meyer
Sigers: Aditya Iyengar, Rohith Paritala, Mohana Bhogaraju, Divya Divakar
Lyrics: Srimani

Audio Credits:
Keyboards: Mickey j Meyer
Rhythm Programming: Venkatesh Patvari
Guitars: Arun Chiluveru
Flute: Ravi Shankar
Veena: Phani Narayana
Violin: Sandilya pisapati
Indian Rhythms: Vikram
Album Recorded at: Inspire Studios (Hyderabad)
Album Mixed by: Mickey J Meyer
Album Mastered by: Darren Vermass ( New Jersey)

5:49:00 PM





Watch & Enjoy Shatamanam Bhavati Audio Launch Live, Starring Sharwanand, Anupama Parameshwaran, Prakash Raj, Jayasudha, Music by Mickey J Meyer. Produced by Dil Raju and Directed by Vegesna Satish.


Movie Name : Shatamanam Bhavati
Banner : Sri Venkateswara Creations
Producer : Dil Raju
Director : Vegesna Satish
Music Director : Mickey J Meyer
Actor : Sharwanand
Actress : Anupama Parameshwaran
Lable : Aditya Music

MKRdezign

{facebook#https://www.facebook.com/Thevideohive-112627722477744/} {google-plus#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget